Thursday 23 August 2018

                                ఆత్మీయ  అభివృద్ధి పత్రిక 

       వారు దానిని చసువుకొని అందువలన  ఆదరణ పొంది సంతోషించిరి                                                                                         అ. పో.  కార్యములు  15:31

                    ప్రభువైన క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు నామమున మీ అందరికి నా  శుభాభివందనములు . ఆనాదిలోనే  జగత్పునాది  వేయబడకమునుపే తన ప్రేమ చేత నన్ను ఆకర్శించుకుని తన రక్షణను అనుగ్రహించిన దేవుడు.ఆ  దేవుని గూర్చిన కార్యము చేయుటకు నా ఆత్మ నన్ను తొందర పెట్టుచున్నది. అయన కొరకై ఏదో ఒక విదముగా వాడబడాలని ఉద్దేశ్యం తో బాల్యం నుండి నేను నేర్చుకున్న ,గ్రహించిన ,విన్న నాకు నేనుగా గ్రహిస్తున్నటువంటి దేవుని వాక్కును ప్రతి మాసం ఒక అంశం ద్వారా ఈ ఆత్మీయ  అభివృద్ధి పత్రిక తో మీతో పంచుకోవాలనే ఉద్దేశ్యం తో మీకు వ్రాస్తున్నాను 

                                       అంశం :వ్రాసుకోనుము

                        సంగితములతోను కీర్తనలతోను అత్మీయాసంబందమైన పద్యములతోను ఒకనికి ఒకడు భొదించుచు ,బుద్ది చెప్పుచు దేవుని గూర్చిన గానము చేయుచు ,సమస్తవిదములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్దిగా నివసిమనియ్యుడి.   కొలోస్సి 3:16
వ్రాయబడుట,వ్రాసుకోనుము,వ్రాయుము ,ముద్రింపుము మరియు లిఖించుము అనే పదాలను బైబిల్ గ్రంధంలో మనం గమనించినట్లైతే పాత నిబందన గ్రంధంలో 22 పుస్తకములలోను ,క్రొత్త నిబందన గ్రంధంలో 27 పుస్తకములలో మొత్తం 279 అద్యయాలలో 456సార్లులకు పైగా  కనబడుతునట్లుగా చూడవచ్చును.  బైబిల్ గ్రంధం లో ఇన్ని సార్లు కనబడుతున్నదంటే ఎంత ప్రాముఖ్యమైన మాటో మనం  అర్ధం చెసుకొవ్వలి.
మొదటగా వ్రాయబడుట అనే మాటను నిర్గమ 17:14లో చుడవచును  అక్కడ దేవుడు మోషేతో నేను జరిగించు కార్యం గురించి వ్రాసి వినిపించుము అని చెపుతున్నాడు .
రెండవదిగా నిర్గమ 24:4లో మోషే దేవుని మాటలన్నింటిని వ్రాసి ప్రజలకు వినిపించినట్లుగా చుస్తము.
మూడవదిగా నిర్గమ 24:12,31;31:18;32:15,16 లలో మహోన్నతుడైనటువంటి దేవుడే మానవ జీవితాలను క్రమ పరచేందుకు స్వయానా తన స్వహస్తాలతో వ్రాసి ఎస్తునట్లుగా చుడవచును .
                                   అవిదముగ దేవాతి దేవుడు ఆనాటి కాలములోనే తన ఆత్మ ద్వారా అనేకుల చేత జీవం గల తన వాక్కును వ్రాయించి మనకు ఇచ్చాడు. మలాకి 3:16,యోహాను 20:30,31,అ.పొ  కార్యం 1:1,2;15:4,రోమ 15:4,   2కోరింథు 3:2,3,2పేతురు 1:21 లలో మనం తేటగా గమనించవచ్చు .అవి నేటికి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయ్,మరి ముఖ్యంగా క్రొత్త నిబందన గ్రంధంలోని పుస్తకాలు మనం క్రీస్తు రక్షణ వెలుగులోనికి ఎలా నదిపించగలము వ్రాయుట అనే శ్రేష్టమైన కార్యం ద్వారా దేవుడు నేటికి తన ప్రేమగల తన రక్షణను మన మద్య ఉంచి వ్యాక్యరుపిగా మనమధ్య నివసిస్తూన్నడు .ఇంకా గమనిస్తే మన ప్రభువైన క్రీస్తు(యోహాను 8:6-8) కూడా తన వ్రేలితో వ్రాస్తున్నట్లుగా గమనించగలము ,మన ప్రభువైన క్రీస్తు కలిగిన అ గునంను మనంను కలిగి ఉందాము .
                                 దేవుని మాట సెలవిస్తునట్లుగా ద్వితి 11:18-20 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చెతులమీదను సుచనులుగ కట్టుకోవలెను ,అవి మీ కన్నుల నడుమ భాసికలుగా ఉండవలెను ,నీవు నీ ఇంట కూర్చుండునపుడును త్రోవను నడుచునప్పుడును పడుకోనునపుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబందకముల మీదను నీ గావునుల మీదను వాటిని వ్రయవలెను.
                                  మన ప్రభువైన క్రీస్తు సాతాను చేత శో దించబదుచున్నప్పుడు సాతనుకు సమాధానంగా వ్రాయబదియున్నదిగద అని చెప్పినట్లుగా చూస్తాం . ఇందులో మనం గమనించ వలసినవి ప్రాముఖ్యంగా రెండు ఉన్నవి అవి ఏమిటంటే మొదటగా శోధనలను మనం వాక్యంతో జయించాలిరెండవదిగా వ్రాయబదియున్న దానిని పాటించాలి.దానికి మనం ఏంచెయ్యాలి అంటే మనల్ని ఆకర్షించిన వాక్యంను వ్రాసుకోవాలి నేర్చుకోవాలి.
ద్వితి 31:19 కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయెలియులకు నేర్పుడి ఈ కీర్తన ఇశ్రాయెలియుల మీద నాకు సాక్షార్దంగా నుండునట్లు దానిని వారికీ కంరపారముగా చెయుంచుము. ఈ వ్యాక్యమును బట్టి మనం వ్యాక్యమును కంరపారము చెయ్యాలి దేవుడు మనకు చెప్పకనే చెపుతున్నాడు.
యోహోషువ 1:8 వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారత్రము దానిని ద్యానించిన యెడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్థించెదవు .
కీర్తన 1:1 యెహోవ ధర్మ శాస్రమందు ఆనందించుచు దీవారత్రము దానిని ద్యానించువాడు ధన్యుడు.
ద్వితి 17:22 దేవుడైన యెహోవాకు బయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కటడలను అనుసరించి నడుచుకోనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంధమును చదువుచుండ వలెను.  
పై వాక్యములను బట్టి దేవుని వాక్యమును ఎల్లప్పుడును ద్యానించాలి.
                  దేవుని వాక్యంను వ్రాసుకోనుటకు విసుగు చెందకూడదు, నిర్గమ 34:1 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రసెదను. దేవాతిదేవుడు మానవులను క్రమపరచుటకు ఎంత శ్రద్ధ చుపుతున్నాడో ఇక్కడ మనకు అర్ధం అవుతుంది. అయన మరల మరల వ్రాసి ఇస్తాను అన్తున్నడు. 
     మరి ఈ యుగములో దేవుడు మన హృదయములపైన తన మాటలను వ్రాయాలని ఆశపడుతున్నాడు,మరి దేవుని వాక్యము నీ హృదయములో వ్రాయబడుతుందా?జాగ్రత్త  
అ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబందన ఇదే నా ధర్మములను వారి హృదయమునందుంచి  వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. హెబ్రీ 10:16
       ఈ సంగతులు ద్రుష్టంతములుగా వారికీ సంబవించి యుగామందున్న మనకు బుద్ది కలుగుటకై వ్రాయబడెను.  1కోరింథి 10:11
                                                1థెస్సలోనిక 5:27 
     సహోదరులందరికి ఈ పత్రిక చదివి వినిపించావలేనని ప్రభువు పేర మీకు ఆన బెట్టుచున్నాను



అనేక విషయములు వ్రాయాలనే ఆశ వున్నదికాని వ్రాయలేక పోవుచున్నాను ప్రభువు చిత్తం ఐతే మరొకసారి వ్రాసెదను . సహోదరి సహోదరులారా యీ  పరిచర్య కొనసాగా బడుటకు మీ ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోనుడి .
                        ఈ పత్రిక గూర్చి మీ అభిప్రాయములను తెలియ జేయుడి .
                   దేవుడు ఈ చిన్నిపత్రికను  దీవించి మీతో మాట్లాడునుగాక! ఆమెన్

                                                                                                                          ఇట్లు
                                                                                                    ప్రభువునందు మీ సహోదరుడు
                                                                                                      కాటం  ఇమ్మనుయేలు  రాజు
                                                                                                       8500411860,9618336621